1813 తర్వాత ట బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ప్రభుత్వం మిషనరీల కార్యకలాపాలను అనుమతించిన ప్పుడు ఎటువంటి వైఖరిని అవలంబించింది ? మతాంతరీకరణ చెందిన వ్యక్తి ఆలోచన నుంచి, జీవితంలో నుంచి,కులం తప్పనిసరిగా తుడిచి పెట్టుకొని పోవాలన్న విషయాన్ని దృష్టిలోకి తీసు కొందా? మొట్టమొదటిసారిగా ఏర్పాటైన ప్రొటెస్టెంట్ మిషనరీ వారు ఈ అంశాన్ని సానుకూలంగా సమర్ధించినట్లు లేదు. మిషనరీలు కులం పట్ల చూపిన అసహన వైఖరిని గురించి డాక్టర్ హైన్ 1814 లో రాసినాడు.
"హిందువులలో పేరుకుపోయిన రాజకీయ విభజన ఏ విధంగాను మత ఉనికి సంబంధించినదిగా ఉండేటటువంటి కాదు అయితే చాలామంది జ్ఞానులు అనుకున్నవారు ఈ సంబంధం ఉన్నది అనుకుంటారు. హిందువులకు క్రైస్తవాన్ని అందించే ముందు వారి కులాన్ని ఉంచుకోవటానికి అనుమతిస్తే ఎటువంటి ఊగిసలాట లేకుండా మతాంతరీకరణ కు పెద్ద సంఖ్యలో ఒప్పుకుంటారు
"హిందువులలో పేరుకుపోయిన రాజకీయ విభజన ఏ విధంగాను మత ఉనికి సంబంధించినదిగా ఉండేటటువంటి కాదు అయితే చాలామంది జ్ఞానులు అనుకున్నవారు ఈ సంబంధం ఉన్నది అనుకుంటారు. హిందువులకు క్రైస్తవాన్ని అందించే ముందు వారి కులాన్ని ఉంచుకోవటానికి అనుమతిస్తే ఎటువంటి ఊగిసలాట లేకుండా మతాంతరీకరణ కు పెద్ద సంఖ్యలో ఒప్పుకుంటారు
చాలా వేగంగా వృద్దిచెందాలని, అత్యున్నతంగా విజయం సాధించాలనే దృష్టితో మిషనరీలు కొన్ని తప్పటడుగులు వేసే విధంగా వలలో పడ్డారు. ఒక హిందువును మతాంతీకరణ చేసే ముందు అతను తన కులాన్ని విడనాడాలని చెపుతారు.ఇది భారతదేశంలో హేయమైన చర్య. ఈ హేయ స్వభావమే మతాంతీకరణకు శకివంతమైన ప్రతిభందకమౌతుంది. మిషనరీలలో కులంపై పొడసూపిన భేదాభిప్రాయాలను పరిష్కరించాలని హేబర్ ఆకాంక్ష పడ్డాడు.
హెబర్ బిషప్ కాలేజిలో పనిచేసే క్రిస్టియన్ డేవిడ్ అనే వ్యక్తి ద్వారా స్థానిక క్రైస్తవ మాతాంతరీకులకు కొన్ని ప్రశ్నల ను పంపి సర్వే నిర్వహించారు.ఆ సర్వే ద్వారా క్రిస్టియన్ డేవిడ్ గారు వెల్లడించించిన అభిప్రాయం ఏమిటంటే,
దక్షిణ భారతదేశంలోని స్థానికుల మధ్య "కులం యదార్థంగా ఒక ప్రాపంచిక భావన.అది ఏ రకంగాను వాస్తవికమైన లేక అవాస్తవికమైన మతానికి సంభందించిన మేధో దృష్టి కాదు" ఉన్నత కులాల వారు దిగువ కులాల వారితో అన్యోన్య సంభందాలను కలిగి ఉండటానికి చూపే విముఖత ఏ మతపరమైన, మూఢాచారాల ప్రాతిపదికపైన ఆధారపడినది కాదు. అది పూర్తిగా సామాజిక కారాణల వల్లనే ఉంట్టుంది. ప్రాపంచింక సంపద ఆధారంగానో, ఆదర్శ సంభదమైన మార్గాల పరంగానో ఈ తేడాలు కొనసాగలేదు. క్రిస్టియన్ డేవిడ్ ప్రకారం దిగువ కులాలు తరచుగా అగ్రమనోభావాలకు ధిక్కారం కలిగించే రీతిలో భవ వ్యక్తీకరణం చేయడం వల దూకుడుగా, స్వీయగౌరవాన్ని కలిగి ఉండే విధంగా దిగువ కులాలు ఉండటం వల్ల పరస్పర తేడాలు ఉన్నాయని ఈయన భావించాడు.
దేవుని దృష్టిలో ప్రజలందరు సమానులేనన్న క్రైస్తవ మత సూత్రం అభినందించదగ్గది. కాని అదే స్థాయిలో ఖచ్చితమైన వాస్తవమేమిటంటే మానవుని దృష్టిలో అందరు సమానులు కారు. అంతేకాదు దేవుడు, మనుషులందరు సమానులుగా ఉండటాన్ని ఉద్దేశ పడ్డాడన్నది కూడా ఒక స్వచ్చమైన ఊహ మాత్రమే! సమాజ తేడాలు అన్ని చోట్లా ఉన్నాయి. ఇంకా వాదిస్తే, బ్రిటిష్ దృష్టిలో దక్షిణ భారతదేశంలోని క్రైస్తవుల మధ్య కొనసాగుతున్న తేడాలు సామాజికమే. అటువంటప్పుడు భిన్న మానవులలో వార్గాలలో లేని "సమానత్వ సూత్రాన్ని" అమలు పరిచే ప్రయత్నాల వల్ల చేపట్టిన మతాంతీకరణ చర్యలు భంగపడడం సమంజసమేనా?
బిషప్ హెబర్ తన సమంజసమైన ఆలోచనతో ముందే ఒక అంశాన్ని తెలిపినాడు. క్రైస్తవ మత లక్ష్యం కోసం తాను ఆధునికుడుగా పనిచేయ్యాలని నిర్ణయించుకొన్నానని,పేరుకొని పోతున్న అమితోత్షాహపు స్వభావాన్ని కనిష్టికరించి సంయమన రీతిలో వ్యవహరించే ఏ ముఖ్య మిషనరి సాధించినట్లే లక్ష్యాల్ని సాధించగలమని భావించాడు. అటువంటి దృష్టితోనే క్రొత్త సీసాలో పాత సారా నింపడాన్ని వ్యతిరేకిస్తున్న వారి వైపు అధికారాన్ని,ఆమోదాన్ని తెలిపినాడు."
ఇదే అభిప్రాయాన్ని 1841లో భారతదేశంలోని మచిలీపట్నంలో చర్చి ఆఫ్ ఇంగ్లాండ్ మిషిన్ వర్క్స్ తరపున వచ్చిన ప్రొటెస్టెంట్ మిషనరీ రెవరెండ్ రాబర్ట్ నోబుల్ వ్యక్త పరిచాడు. కావాలని , ఒక పద్ధతి ప్రకారంగా మిషనరీ స్థాపించిన పాఠశాలలో పరియాల, పాకి పనివారల, చర్మకారుల కుటుంబాల వారిని మినహాయించాడు. పాఠశాలల్లో కుల ప్రవృత్తిని ప్రవేశ పెడుతున్నారన్న అభిశంసన కు ఈ క్రింది విధంగా జవాబిచ్చాడు." అతి దయార్ద్రమైన , మర్యాద పూర్వకమైన ఇంగ్లాండు తల్లిదండ్రులు కూడా తన కొడుకులను, తన సేవకుల బిడ్డలతో పాటుగా విద్య నేర్పించడానికి ఇష్టపడరు. నిజానికి గ్రామంలో ఉన్న పిల్లలతో ఆడుకోవడానికి నేను అప్పుడప్పుడు దొంగతనంగా పోయిన నేరానికి తరచుగా నా తండ్రిచే శిక్షింపడేవాడిని. ఉన్నతంగా శిక్షణ గడప బడ్డ క్రైస్తవ కుటుంబాలలోని పిల్లలు, సేవకుల పిల్లలతో కలసి మాట్లాడడాన్ని, వారు ఎప్పుడు కూడా అనుమతించే వారు కారు. నా తల్లిదండ్రులు సేవకుల పిల్లలతో కలసి తిరగడానికి అనుమతించేవారు కారు. అట్లాగే పవిత్ర క్రైస్తవ బోధనలను వచ్చేటప్పుడు విధిగా పరియా,ఊడ్చే వారితో పాటుగా బ్రాహ్మణులు కూడా కూర్చోవాలని షరతు నా మటుకు అర్థం లేనిదిగాను, క్రైస్తవేతర మైనదిగాను అనిపిస్తుంది."ఈ విధంగా అన్ని మిషనరీలు క్రైస్తవాన్ని వ్యాపించే విధంగా సరళతరం చేయాలని అంగీకరించాయి. ఈ అంశంపైన కాథలిక్కులు, లూథరన్ లు, ప్రొటెస్టెంట్ ల మధ్య తేడా ఉంది. ఈ తేడా డిగ్రీ లోనే ఉంది. మతాంతరీకరణ చేసుకున్న క్రైస్తవులలో కులం రూపాల ఉనికి ఉన్నదంటే అది క్రైస్తవాన్ని సరళతరం చేసి వ్యాపింప చేయాలన్న విధానంలోనే ఉన్నది. ఈ విధానాన్ని అవలంబించడం వల్ల వచ్చే పరిణామాలను క్రైస్తవ మిషనరీలు ఊహించలేదు. "కులాన్ని తొలగించ లేని క్రైస్తవం వల్ల హిందువుకు ఒరిగేదేమిటి? " అనే ప్రశ్న ఒకనాడైనా ఎదురవుతుందనే విషయాన్ని మిషనరీలు విస్మరించాయి. వారు తమ లక్ష్యాన్ని ఒకరిని క్రైస్తవుడిగా చేసినందువల్ల క్రీస్తు అనుసరికుడవుతాడని తప్పుగా అర్థం చేసుకున్నారు.
Ref :
డా|| బాబాసాహెబ్ రచనలు -ప్రసంగాలు - సంపుటం 5,
పేజి నంబర్లు 587 -591
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచూరణలు 1994
An exception must however be made in favour of the Protestant Missionaries of America. In July 1847 the American Missionaries passed the following resolution regarding this question
That the Mission regards caste as an essential part of heathenism, and its full and practical renunciation, after instruction, as essential to satisfactory evidence of piety: and that renunciation of caste implies at least readiness to eat. under proper circumstances, with Christians of any caste.
No comments:
Post a Comment